- Advertisement -
నవతెలంగాణ హైదరాబాద్: సికింద్రాబాద్లోని ఇండియన్ స్పెర్మ్ టెక్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. క్లూస్ టీమ్ సహాయంతో గోపాలపురం పోలీసులు ఆధారాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. పలువురి నుంచి సేకరించిన వీర్యకణాలకు సంబంధించిన మూడు డబ్బాలు, ఆధార్ కార్డులను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
నిర్వాహకుడిగా ఉన్న పంకజ్ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు. ఇటీవల సృష్టి టెస్టు ట్యూబ్ బేబీ సెంటర్ అక్రమాలు బయటపడిన నేపథ్యంలో ఇండియన్ స్మెర్మ్ టెక్లో రోజువారీ కూలీలు, యాచకులు, పాదచారులకు కమీషన్ ఇచ్చి వీర్య కణాలు, అండాలను సేకరిస్తున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి చేసి ఏడుగురిని అరెస్టు చేశారు.
- Advertisement -