- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
జిల్లా పెద్దవూర మండ కేంద్రం లోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ఖాళీగా ఉన్న సీఈ,ఎం పీ హెచ్ డబ్యూ సీట్లు కోసం స్పాట్ అడ్మిషన్లు నిర్వహిస్తున్నామని కళాశాల స్పెషల్ ఆఫీసర్ జ్యోస్న ఒక ప్రకటనలో తెలిపారు. కేజీబీవి కళాశాలలో అడ్మిషన్ పొందాలనుకునే విద్యార్థులు కళాశాలలో నేరుగా సంప్రదించి అడ్మిషన్ పొందవచ్చని వివరించారు. ఇంటర్ ప్రవేశం పొందే విద్యార్థులు వారి విద్యార్హత ధృవీకరణ పత్రాలతో పాటు ఆధార్, ఇతర ధృవీకరణ పత్రాలు తీసుకురావాలని స్పెషల్ ఆఫీసర్ సూచించారు.
- Advertisement -