Friday, June 6, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతొక్కిస‌లాట..మాట‌లు రావ‌డం లేదు : విరాట్ కోహ్లీ

తొక్కిస‌లాట..మాట‌లు రావ‌డం లేదు : విరాట్ కోహ్లీ

- Advertisement -

నవతెలంగాణ-హైదరాబాద్ : బెంగళూరులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టు ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆనందోత్సాహాలు తీవ్ర విషాదంగా మారాయి. బుధవారం నగరంలో నిర్వహించిన విజయోత్సవ ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 11 మంది అభిమానులు ప్రాణాలు కోల్పోగా, మరో 47 మందికి పైగా గాయపడ్డారు. ఈ దుర్ఘటన చిన్నస్వామి స్టేడియం సమీపంలో చోటుచేసుకుంది. 18 ఏళ్ల నిరీక్షణ ఫలించి, ఆర్సీబీ తొలిసారి ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకోవడంతో వేలాది మంది అభిమానులు సంబరాల్లో పాల్గొనేందుకు తరలివచ్చారు.
అయితే, ఈ కార్యక్రమానికి సరిగ్గా ప్రణాళిక లేకపోవడం, అభిమానుల సంఖ్యను తక్కువగా అంచనా వేయడం మరియు స్టేడియంలో ప్రవేశానికి ఉద్దేశించిన పరిమిత సంఖ్యలోని ఉచిత పాసుల పంపిణీపై గందరగోళం నెలకొనడం వంటివి ఈ దుర్ఘటనకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది. బుధవారం మధ్యాహ్నానికే విధానసౌధ, ఎంజీ రోడ్, చర్చ్ స్ట్రీట్ పరిసర ప్రాంతాలకు సుమారు రెండు లక్షల మంది అభిమానులు చేరుకున్నారని అంచనా. ఇది పోలీసుల అంచనాలను మించిపోయింది.
వాస్తవానికి ఆర్సీబీ యాజమాన్యం విధానసౌధ నుంచి చిన్నస్వామి స్టేడియం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించి, ఆ తర్వాత సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయాలని ప్రకటించింది. అయితే, ఉదయం ఆలస్యంగా ట్రాఫిక్ పోలీసులు ర్యాలీని రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో అప్పటికే భారీగా చేరుకున్న అభిమానుల్లో మరింత గందరగోళం నెలకొంది. తమ అభిమాన ఆటగాళ్లను చూసేందుకు వచ్చిన జనసందోహాన్ని నియంత్రించేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో పరిస్థితి అదుపుతప్పి తీవ్రమైన తొక్కిసలాటకు దారితీసింది.
ఈ విషాద ఘటనపై ఆర్సీబీ యాజమాన్యం అధికారిక ప్రకటన విడుదల చేసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ “ప్రతి ఒక్కరి భద్రత, శ్రేయస్సే మాకు అత్యంత ముఖ్యం” అని పేర్కొంది. జట్టు స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ కూడా ఈ వార్త విని తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాడు. “ఏం మాట్లాడాలో మాటలు రావడం లేదు. తీవ్ర మనోవేదనకు గురయ్యాను. ఈ ఘ‌ట‌న న‌న్ను తీవ్రంగా క‌లిచివేసింది” అంటూ సోషల్ మీడియాలో విచారం వ్యక్తం చేశాడు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -