Wednesday, June 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జై జవాన్..జై కిసాన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు

జై జవాన్..జై కిసాన్ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్: రాష్ర్టావతరణ దినోత్సవం సందర్భంగా పెద్ద ఏడిగి గ్రామం జూకల్ మండలం కామారెడ్డి జిల్లాలో  హనుమాన్ మందిర్ నందు టి ఎమ్ ఆర్ ఫౌండేషన్, ఆధ్వర్యంలో,  జై జవాన్ …జై కిసాన్… అనే కార్యక్రమాన్ని నిర్వహించినాము. భారతదేశ ఆర్మీ, యందు పనిచేసిన చంద్రకాంత్ నాయక్ గారిని ఘనంగా సన్మానించనైనది. అదే విధంగా ఆరుగాలం కష్టపడి, అన్నదాతగా మానవాళి ఆకలిని తీర్చే, రైతన్న చౌడారపు సూర్యకాంత్ ను కూడా ఘనంగా సన్మానించినైనది. ఈ సందర్భంగా తాటి  వీరేశం చైర్మన్ మాట్లాడుతూ.. మాతృభూమిని, అహర్నిశలు ,కంటికి రెప్పలా కాపాడే వీర సైనికులు నిజమైన హీరోలు. సమాజానికి మనందరికీ నిస్వార్ధంగా కష్టపడుతూ ఆహారాన్ని అందించే రైతన్నలు కనిపించే దేవుళ్ళు, వీరిని సేవించుకునే భాగ్యం కలిగినందులకు మనందరం గర్వపడాలి. నిస్వార్ధంగా పనిచేసే, వీరి సేవలకు తగిన రీతిలో గుర్తింపునివ్వాలి. ఇది ఒక యజ్ఞం. నిరంతర ప్రక్రియ, సామాజిక బాధ్యతగా దీనిని కొనసాగిద్దాం. అందరి సహకారంతో సమాజానికి సేవ చేద్దాం. సదా దేశ సేవలో పాల్గొందాం.. అని అన్నారు.  ఈ కార్యక్రమంలో రామచందర్, రాజేశ్వర్ అపాసివార్ రవీందర్, జే ఆనంద్ కుమార్, డి గంగారం, బసప్ప, నాయక్ చంద్రకాంత్ ,డోన్ లే ఉమాకాంత్ ,బాలాజీ మరియు సతీష్ పాల్గొని ప్రసంగించినారు. కార్యక్రమానికి గౌరవ అతిథిగా జూకల్ వాస్తవ్యులు శ్రీ బల్లి వార్ రాజేందర్  హాజరైనారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -