- Advertisement -
మంత్రి శ్రీధర్ బాబు ప్రగాఢ సానుభూతి
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని వళ్లెంకుంట మాజీ సర్పంచ్, మండల మాజీ ఎంపీపీ తెలంగాణ రాష్ట్ర ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేట్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి మాతృమూర్తి అయిత లక్ష్మీ (70) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతుండేది. బుధవారం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఇటీవల వలనే ప్రకాష్ రెడ్డి సోదరి మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రకాష్ రెడ్డి తల్లి అకాల మరణంపై రాష్ట్ర ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు.
- Advertisement -