నవతెలంగాణ – భువనగిరి: తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని జిల్లా కోర్టులో మెుదటి అదనపు జిల్లా న్యాయమూర్తి, ఇన్చార్జి అధ్యక్షురాలు ముక్తిదా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎంతోమంది త్యాగాలతో రాష్ట్రం సిద్ధించిందన్నారు. నూతన రాష్ట్రం అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ ముందుకు సాగాలని ఆకాంక్షించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఇంచార్జ్ కార్యదర్శి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి శ్యాంసుందర్ మాట్లాడుతూ ‘స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి స్వరాష్ట్ర ఆకాంక్ష ఉందని నాటి నుంచి వివిధ దశలలో పోరాటాలు చేసి రాష్ట్ర్యాన్ని సాధించేందుకు ఎంతమంది పోరాటం చేశారని అని అన్నారు. జూనియర్ సివిల్ జడ్జి స్వాతి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో శ్రీకాంతచారి త్యాగం చిరస్మరణీయమని, నాడు రాష్ట్ర సాధన కోసం ప్రతి ఒక్కరూ ప్రత్యేక్షంగా, పరోక్షంగా బాగస్వాముల్యయ్యారు. బార్ అసోసియేషన్ అధ్యక్షుడు తెలంగాణ రాష్ట్రం కోసం చేసిన పోరాటంలో న్యాయవాదులు కీలకంగా నిలిశారని అన్నారు. సీనియర్ న్యాయవాదులు నాగారం అంజయ్య, బాబురావు మాట్లాడుతూ తెలంగాణ తొలి, మలి దశ ఉద్యమాల ప్రారంభానికి భువనగిరికి ప్రత్యేక చరిత్ర ఉందని, నాడు ఎన్ని నిర్బందాలు ఉన్నా తెలంగాణ ఉద్యమాన్ని మొదలు పెట్టింది భువనగిరి బార్ అసోసియేషన్ నుంచి అని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో చార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బోల్లేపల్లి కుమార్, పీపీ దామోదర్రెడ్డి, చీప్ లీగల్ ఎయిడ్ డిపెన్స్ కౌన్సిల్ జైపాల్ పాల్గొన్నారు.
కోర్టు ఆవరణలో రాష్ర్టావతరణ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES