Wednesday, June 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు 

బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర అవతరణ వేడుకలు 

- Advertisement -

నవతెలంగాణ – భూపాలపల్లి : బీఆర్ఎస్ ఆధ్వర్యంలోతెలంగాణా రాష్ట్ర అవతరణదినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. సోమవారం భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణా రెడ్డి  ఆదేశానుసారం,భూపాలపల్లి బీఆర్ఎస్ అర్బన్  అధ్యక్షులు కటకం జనార్దన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో జరిగిన అవతరణ దినోత్సవ వేడుకలకు భూపాలపల్లి మాజీ ఎంపీపీ, పార్టీ జిల్లా సీనియర్ నాయకులు కల్లెపు రఘుపతి రావు ముఖ్య అతిథిగా హాజరై జెండా ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కటకం జనార్దన్ , రఘుపతి రావు లు మాట్లాడుతూ …సమైఖ్య ఆంధ్ర ప్రదేశ్  లొ తెలంగాణా కి జరుగుతున్న వివక్ష కి వ్యతిరేకంగా మన నీళ్లు, మన నిధులు, మన నియామకాలు మనకే దక్కాలి అనే నినాదం తో  కెసిఆర్  తెలంగాణా రాష్ట్ర సమితి అనే పార్టీ ని స్థాపించడం జరిగిందని గుర్తు చేశారు. తెలంగాణా రాష్ట్ర సాధన కోసం కెసిఆర్ చచ్చుడో, తెలంగాణా వచ్చుడో అనే సంకల్పం తో 9 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి, తెలంగాణా లొని అన్ని వర్గాల ని కలుపుకొని ఢిల్లీ పాలకుల మెడలు వంచి 2014 లొ తెలంగాణా రాష్ట్రo సాధించిన తెలంగాణా బాపు కెసిఆర్ అని తెలిపారు.  సాధించిన తెలంగాణా రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి అయ్యి దేశం లొనే ఏ రాష్ట్రం లొ లేని విధంగా అభివృద్ధి లొ, సంక్షేమo లొ తెలంగాణా రాష్ట్రo ని ముందు వరుస లొ నిలిపిన ఘనత కేసీర్ ది అని కొనియాడారు. ఈ  కార్యక్రమం లొ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్  వెంకటరాణి సిద్ధూ,  మాజీ కౌన్సిలర్స్, జిల్లా నాయకులు, వార్డ్ అధ్యక్షులు, యువజన, మహిళా, మైనారిటీ నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -