– కోదండరామ్, అమీర్ అలీఖాన్లకు షాక్
– మధ్యంతర ఉత్తర్వుల తర్వాత
– ప్రమాణస్వీకారంపై సుప్రీం ఆక్షేపణ
న్యూఢిల్లీ : తెలంగాణలో గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నియామకా లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలపై సర్వోన్నత న్యాయస్థానం స్టే విధించింది. వారి నియామకాలను నిలిపివేస్తూ తీర్పు ఇచ్చింది. ఎమ్మెల్సీలుగా కోదండరామ్, అమీర్ అలీఖాన్ నియామకాలను భారత రాష్ట్ర సమితి నేత దాసోజు శ్రవణ్, సత్యనారాయణ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై విచారించిన సుప్రీంకోర్టు.. బుధవారం తీర్పు వెలువరించింది. తదుపరి ఉత్తర్వులకు అనుగుణంగా ఎంపిక ఉండాలని పేర్కొంటూ గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది. మధ్యంతర ఉత్తర్వుల తర్వాత ప్రమాణస్వీకారం చేయడం తప్పు అని సుప్రీంకోర్టు పేర్కొంది.
గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకాలపై స్టే
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES