- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలతో లాభాల్లో ముగిశాయి. భారత్తో వాణిజ్య ఒప్పందం ఖరారు కానుందంటూ ట్రంప్ వ్యాఖ్యలు కూడా సానుకూలతను పెంచాయి. ఈ క్రమంలో సెన్సెక్స్ ఇంట్రాడేలో 85 వేల మార్కును అధిగమించి, 368.97 పాయింట్ల లాభంతో 84,997.13 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 117.70 పాయింట్ల లాభంతో 26,053.90 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 88.21గా ఉంది.
- Advertisement -



