- Advertisement -
హైదరాబాద్ : ప్రముఖ రియాల్టీ డెవలపర్ స్టోన్క్రాఫ్ట్ గ్రూప్ యాదగిరిగుట్టలో 110 ఎకరాల్లో టెంపుల్ టౌన్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది. 90 ఎకరాల్లో ప్రీమియం రెసిడెన్సీయల్ ప్లాట్లను ఏర్పాటు చేయడం ద్వారా రూ.500 కోట్లు, 20 ఎకరాల్లో సీనియర్ లివింగ్ ఎన్క్లేవ్ ఏర్పాటు ద్వారా రూ.600 కోట్ల ఆదాయాన్ని అంచనా వేస్తోన్నట్లు తెలిపింది. మొత్తం ఆదాయం రూ.1,100 కోట్లుగా అంచనా వేస్తోన్నామని స్టోన్గ్రూప్ ఫౌండర్, ఎండి కీర్తి చిలుకురి తెలిపారు. ఆధ్యాత్మికతతో ముడిపడిన ఆధునిక జీవనం కోసం ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశామన్నారు. ముఖ్యంగా సీనియర్ లివింగ్ డిమాండ్ పెరుగుతోందన్నారు.
- Advertisement -



