హీరో విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం ‘భద్రకాళి’. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్పై రామాంజ నేయులు జవ్వాజీ నిర్మించారు.
విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. ఈ సినిమా ఈనెల 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సోమవారం హీరోయిన్లు తప్తి రవీంద్ర, రియా జిత్తు మీడియాతో సినిమా విశేషాలు పంచుకున్నారు.
హీరోయిన్ తప్తి రవీంద్ర మాట్లాడుతూ,’మాది మహారాష్ట్ర. హీరోయిన్గా తమిళంలో చేసిన ఫస్ట్ సినిమా ఇది. అరుణ్ డైరెక్షన్ టీం చేసిన అడిషన్, లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ కోసం ఓకే చేశారు. ఈ సినిమాలో చాలా రిలేటబుల్ క్యారెక్టర్ చేస్తున్నాను. అందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. డైరెక్టర్ చాలా అద్భుతంగా క్యారెక్టర్ డిజైన్ చేశారు. విజయ్తో నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్. తెలుగు ఆడియన్స్ అన్ని రకాల సినిమాల్ని గొప్పగా ఆదరిస్తారు. సినిమాని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సినిమా కూడా ఆడియన్స్ను మెప్పిస్తుంది’ అని అన్నారు.
‘నేను చైల్డ్ ఆర్టిస్ట్గా దాదాపు 15 సినిమాలు చేశాను. చదువు పూర్తయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. విజయ్ ఆంటోనీ 25వ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మ్యూజిక్ వింటూ పెరిగాను. ఆయన మ్యూజిక్ నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడే ఎక్కువ రివీల్ చేయకూడదు. డైరెక్టర్ అరుణ్ చాలా క్లారిటీ ఉన్న మేకర్. ఇది చాలా ఇంపాక్ట్ ఫుల్ కథ. ఇలాంటి కథ సొసైటీకి చాలా అవసరం. తప్పకుండా ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది’ అని హీరోయిన్ రియా జిత్తు చెప్పారు.
ఇలాంటి కథలు సమాజానికి చాలా అవసరం
- Advertisement -
- Advertisement -