నవతెలంగాణ – భీంగల్: భీంగల్ పట్టణంలోని బస్టాండ్ ప్రాంతంలో ట్రాఫిక్ అంతరాయం. పండ్లు, కూరగాయలు అమ్మేవారికి మున్సిపల్ కమిషనర్ గోపు గంగాధర్, ఎస్సై సందీప్ బుధవారం అవగాహన కల్పించారు. పండ్లు, కూరగాయలు తోపుడు బండ్లు బస్టాండ్ ప్రాంతంలో నిలపడం వల్ల ఇరుకుడా మారి, తరచుగా బస్టాండ్ ప్రాంతంలో ప్రమాదాలు జరుగుతున్నయని, అంతేకాకుండా ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం పండ్లు అమ్మేవారిని, కూరగాయలు అమ్మేవారిని అనువైన స్థలం లకు మార్చడం జరుగుతుందని వారికి తెలిపారు. ట్రాఫిక్ అంతరాయం కలిగిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్సై సందీప్ వారిని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానర్ ఆంజనేయులు. మేనేజర్ నరేందర్, మున్సిపల్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



