సుమారు 51 కేసులు నమోదు
జెడ్పీటీసీగా డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ సేవలు
కేయూ సమావేశంలో కేసీఆర్, ప్రొఫెసర్ జయశంకర్ తో డాక్టర్ శ్రీరామ్ శ్యామ్
నవతెలంగాణ – జమ్మికుంట : జమ్మికుంట జెడ్పీటీసీ డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ మంచి విద్యావేత్త, ప్రజాసేవే తన లక్ష్యం అంటూ చిన్నప్పటినుండి పేద విద్యార్థులకు ప్రజలకు తన వంతు సాయం చేసుకుంటూ వస్తున్నారు. గ్రామస్థాయి నుండి యూనివర్సిటీ, రాష్ట్రస్థాయి లీడర్ గా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యం అంటూ వేలాదిమంది విద్యార్థులను ఏకం చేసి ఉద్యమంలో పాల్గొన్నారు. శ్రీరామ్ శ్యామ్ తెలంగాణ ఉద్యమ కాలంలో సుమారు 51 కేసులు నమోదు అయ్యాయి. చాలా సార్లు జైలు జీవితాన్ని అనుభవించారు. 2001 నుండి తెలంగాణ మలిదశ ఉద్యమంలో జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని ఆబాది జమ్మికుంటకు చెందిన ఇంటర్ చదువుతున్న శ్రీరామ్ శ్యామ్ ఆనాడే చురుకుగా పాల్గొన్నారు. 2001లో టిఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ అధ్యక్షుడిగా, 2003 నుండి 2006 వరకు మండల అధ్యక్షుడిగా పనిచేశారు. 2006 నుంచి 2007 వరకు టిఆర్ఎస్వీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తించారు. 2008లో కాకతీయ యూనివర్సిటీ టీఆర్ఎస్వీ అధ్యక్షుడిగా, 2009 కాకతీయ యూనివర్సిటీ టీఆర్ఎస్వీ ఇన్చార్జిగా బాధ్యతలు నిర్వహించారు. 2009 హుజురాబాద్ సాధారణ ఎన్నికల్లో తెలంగాణ వాదాన్ని విద్యార్థులతో కలిసి గ్రామ గ్రామాన వివరించారు.2009లో కాకతీయ యూనివర్సిటీలో జేఏసీ కన్వీనర్ గా ఎన్నికయ్యారు. నవంబర్ 29న కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా నవంబర్ 18 జేఏసీ ఏర్పాటు చేసిన విద్యార్థుల సభలో ప్రారంభ ఉపన్యాసం చేశారు. 2009 నవంబర్ 23 అలుగునూర్ క్రాస్ రోడ్డు వద్ద కేసీఆర్ ను అరెస్టు చేసి ఖమ్మం జైలుకు తరలిస్తున్న సందర్భంలో కేయు రెండవ గేటు వద్ద ధర్నా రాస్తారోకో చేసి కేటీఆర్ తో సహా అరెస్టు అయ్యారు. 2010 ఫిబ్రవరి 7న కాకతీయ యూనివర్సిటీలో లక్షలాది మంది విద్యార్థులతో పొలికేక సభకు అధ్యక్షునిగా వ్యవహరించారు.
తెలంగాణ రాష్ట్ర సమితి ఇంపీరియల్ గార్డెన్ లో జరిగిన తొమ్మిదవ వార్షికోత్సవ సభలో తెలంగాణ అమరులు శ్రీకాంతచారి విగ్రహాన్ని హైదరాబాద్ ఎల్బీనగర్ చౌరస్తాలో ఏర్పాటు చేయాలని తీర్మానం చేశారు. వైయస్ జగన్మోహన్రెడ్డి పర్యటనను అడ్డుకునే ఘటనలో డాక్టర్ శ్రీరామ్ శ్యామ్ తీవ్ర గాయాలపాలయ్యారు. 2010లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ఉప ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు, హుజురాబాద్ నియోజకవర్గంలో బస్సు యాత్రకు నాయకత్వం వహించారు. 2010 డిసెంబర్ 16న వరంగల్ లో జరిగిన మహాగర్జనకు హుజురాబాద్ నుండి హనుమకొండకు పాదయాత్ర చేశారు. 2011 నుండి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. 2012 తెలంగాణ జేఏసీ కమిటీలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యతలు చేపట్టారు. 2012 అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ని రాయినిగూడెంలో అడ్డుకునే సందర్భంలో ప్రముఖ పాత్ర పోషించడమే కాకుండా సెల్ టవర్ ఎక్కారు. 2013 విద్యార్థులను ఏకంచేసి తెలంగాణ వాదాన్ని గ్రామ గ్రామాన వినిపించేలా కాలేజీ టు విలేజి ప్రోగ్రాములు నిర్వహించారు. 2013లో నారా చంద్రబాబు నాయుడుని పాలకుర్తి సభలో అడ్డుకోవడంలో తన వంతు కృషి చేస్తున్నారు.అడ్డుకోవడమే కాకుండా గాయాల పాలయ్యారు. 2019లో జమ్మికుంట టిఆర్ఎస్ పార్టీ జడ్పిటిసి అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలుపొంది, మండల ప్రజలకు ఎనలేని సేవ చేశారు. జమ్మికుంట జడ్పిటిసిగా 2019 నుండి 2024 వరకు ఐదు సంవత్సరాలుగా జమ్మికుంట మండల ప్రజానీకానికి అనేక సేవలు అందించారు. జమ్మికుంట మండలం అభివృద్ధి పథంలో నడిపించడంలో అధికారులను సమన్వయం చేసుకుంటూ, జమ్మికుంట మండల ప్రజల సమస్య లను తీర్చడంలో క్రియాశీలక పాత్ర పోషించారు. దళిత బంధు పథకం, జమ్మికుంట మండల ఇసుక రీచ్ లపై జిల్లా పరిషత్ లో అనేక సమస్యల పైన మాట్లాడడం జరిగింది. నిస్వార్థ నాయకుడిగా ప్రజల చేరువయ్యారు. నిరంతరం ప్రజల మధ్యలో ఉంటూ ప్రజా సమస్యలు తెలుసుకోవడంలో జెడ్పిటిసిగా మంచి గుర్తింపు పొందారు.
విద్యార్థి దశ నుండి పోరాటాలు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES