Monday, June 9, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చికిత్స పొందుతూ విద్యార్థి మృతి..

చికిత్స పొందుతూ విద్యార్థి మృతి..

- Advertisement -

నవతెలంగాణ – మాక్లూర్ : జిల్లా కేంద్ర ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం నిర్మల్ జిల్లా నరసాపురం గ్రామానికి చెందిన సిందే శివకుమార్ వయస్సు (17) నిజామాబాద్ పాలిటెక్నిక్ కాలేజీలో రెండవ సంవత్సరం చదువుతున్నాడని, సెకండ్ సెమిస్టర్ లో రెండు సబ్జెక్టులు, థర్డ్ సెమిస్టర్ లో రెండు సబ్జెక్టులు, ఫోర్త్ సెమిస్టర్ లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యడని,  మంచిగా చదువుకోమని మందలించారు.. వారం క్రితం సప్లమెంటరీ పరీక్షలు రాయడానికి నిజామాబాద్ వచ్చిడని, ఈ నెల 06 తేదిన మధ్యాహ్నం సమయంలో తాను ఉంటున్న హాస్టల్ నుంచి  దాస్ నగర్ గ్రామ శివారు కు వచ్చి గడ్డి మందు తాగి తిరిగి హాస్టల్ కు వెళ్ళాడని, అక్కడ వాంతి చేసుకోగా అతని స్నేహితులు గమనించి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -