- Advertisement -
నవతెలంగాణ – సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యార్థిని బాసర త్రిబుల్ ఐటీకి ఎంపికైంది. సిరిసిల్ల పట్టణంలోనీ బడ్స్ అండ్ ఫ్లవర్ పాఠశాలలో పదవ తరగతి పూర్తి చేసిన ఎండి మహీన్ ఫాతిమా బాసర ట్రిపుల్ ఐటీకి ఎంపికైనట్లు పాఠశాల కరెస్పాండంట్ కళ్యాణి శర్మ తెలిపారు. పదవ తరగతి ఫలితాలలో మండల ర్యాంకులు సాధిస్తూ కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ర్యాంకులు సాధిస్తున్నామని తెలిపారు. ట్రిపుల్ ఐటికి ఎంపికైన మహీన్ ఫాతిమాను పాఠశాల యాజమాన్యం, పలువురు నాయకులు అభినందించారు. విద్యార్హుల అభివృద్ధికి కృషిచేస్తున్న ఉపాధ్యాయ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -