తరలివచ్చిన వేలాదిమంది
రానా దగ్గుపాటి రాకతో సందడి
పలు సెమినార్ల నిర్వహణ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి- హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్కు వేలాది మంది విద్యార్థులు తరలివచ్చారు. ఇందులో ఏర్పాటు చేసిన వివిధ ప్రభుత్వ స్టాళ్లు, కార్పొరేట్ కంపెనీల స్టాళ్లను బుధవారం భారీగా విద్యార్థినీ, విద్యార్థులు సందర్శించారు. ఈనెల 8 ,9 తేదీలలో నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్లో ఏర్పాటు చేసిన స్టాళ్లలో తమ ఉత్పత్తులను ప్రయివేటు సంస్థలు ప్రదర్శించాయి. నగరంతో పాటు వివిధ జిల్లాల నుంచి ప్రత్యేకంగా వచ్చిన ప్రభుత్వ సంక్షేమ గురుకుల పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు, ఎన్ఎస్ఎస్ విద్యార్థులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ప్రధానంగా ఏరోస్పెస్, మూసీ రివర్ డెవలప్మెంట్, హ్యాండీ క్రాఫ్ట్స్, టూరిజం, ఎడ్యుకేషన్, కరీంనగర్ ఇక్కత్, ఫిలిగ్రి, చేర్యాల పెయింటింగులు, సైబర్క్రైమ్ ఛేదనలో ఉపయో గించే పలు ఆధునాతన పరికరాలు, డ్రోన్లు, రోబో తదితర 27కు పైగా స్టాళ్లు ఏర్పాటు చేశారు. ప్రతీ స్టాల్ను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. ముఖ్యంగా ఆధునిక పరికరాలు, వైమానిక అంశాలను అడిగి తెలుసుకున్నారు.
కాగా, భారత్ ఫ్యూచర్ సిటీలో బుధవారం నుంచి 13వ తేదీ వరకు నిర్వహిస్తున్న ప్లీనరీ సెషన్లలో తొలిరోజు జరిగిన ‘యూత్ ఎంటర్ప్రె న్యూషిప్’ అనే అంశంపై జరిగిన రెండు సదస్సు లలో దాదాపు మూడు వేల మంది పాల్గొన్నారు. వీరిలో గురుకుల పాఠశాలల నుంచి 1000 మంది, లార్డ్స్ కళాశాల నుంచి 700, వివిధ డిగ్రీ కళాశాలల నుంచి 1200మంది, ఎన్ఎస్ఎస్ విద్యార్థులు 500మంది పాల్గొన్నారని నిర్వాహకు లు తెలిపారు. ఉదయం జరిగిన ప్రత్యేక కార్యక్ర మంలో వి-హబ్ సీఈవో విద్యార్థులతో భేటీ అ య్యారు. మధ్యాహ్నం సదస్సుకు ప్రముఖ సినీనటుడు రానా దగ్గుబాటి హాజరై విద్యార్థులతో ముచ్చ టించారు. సాయంత్రం జరిగిన కార్యక్రమం లో మనో జాగృతి సంస్థ ‘కౌమార దశలో మానసిక పరి పక్వత’ అనే అంశంపై వివరించారు. ఈ సంద ర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. విద్యార్థుల కోసం దాదాపు 56 బస్సులను ఏర్పాటు చేశారు. ప్లీనరీ సెషన్లో భాగంగా మహిళా సంక్షేమం, సంస్కృతి విమెన్ రైజింగ్ అనే అంశంపై రెండు సదస్సులు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు.
గ్లోబల్ సమ్మిట్లో విద్యార్థుల కోలాహలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



