- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం సావిత్రి బాయి ఫులే జయంతి వేడుకలను సర్పంచ్ ఉష సంతోష్ మేస్త్రీ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సావిత్రిబాయి చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు సావిత్రి బాయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోని చక్కగా చదువుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని అన్నారు. ఈ సందర్భంగా మహిళ ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు నోట్ బుక్స్, పెన్నులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ వట్నాల్ రమేశ్, హెచ్ఎం రాజేందర్, ఉపాధ్యాయులు నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



