– అభినందించిన కాంప్లెక్సు హెచ్ ఎం షాహినా బేగం
నవతెలంగాణ – అశ్వారావుపేట
మండలంలోని అచ్యుతాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కాంప్లెక్సు స్థాయి లో సోమవారం నిర్వహించిన పలు పోటీల్లో ఆంగ్ల భాష చక్కని చేతి దస్తూరీ లో ఇరువురు విద్యార్ధినులు ప్రధమ స్థానం పొందారు.
పీఎం శ్రీ ఎంపీయూపీఎస్ నారంవారిగూడెం కు చెందిన మూడో తరగతి విద్యార్థిని కుసుమాంజలి,ఐదో తరగతి విద్యార్థిని డింపుల్ శ్రీ మల్లిక లు ను కాంప్లెక్సు హెచ్ ఎం షాహినా బేగం అభినందించారు.ఈ విద్యార్థులు కు ఆంగ్ల భాష పఠనం, చేతిరాత పై తర్ఫీదు ఇచ్చిన ఆంగ్ల ఉపాధ్యాయుడు ఆశిక్ ఆలం ను ప్రశంసించారు.
ఇటీవల జరిగిన జిల్లా స్థాయి ఎఫ్ఎల్ఎన్ లో జిల్లా స్థాయి లో ప్రధమ స్థానం లో నిలిచిన అదే పాఠశాల 5 వ తరగతి విద్యార్థిని ఉషారాణి కి రూ.500 లు నగదు బహుమతి ని అందజేసారు.



