- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ప్రస్తుతం జరుగుతున్న సర్పంచ్ ఎన్నికల్లో భాగంగా డోంగ్లి మండలంలోని సిర్పూర్ మండల సరిహద్దులో ఎన్నికల తనిఖీల చెక్పోస్ట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ చెక్పోస్టును బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరణ్మయి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెక్పోస్టు నిర్వహణలో ఉన్న అధికారులకు పకడ్బందీ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలు దగ్గర పడుతున్న సందర్భంగా వాహనాల తనిఖీలు పకడ్బందీగా చేపట్టాలని కోరారు. ఎన్నికల సందర్భంగా డబ్బు, మద్యం తరలి రాకుండా కట్టుదిట్టమైన తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
- Advertisement -



