- Advertisement -
నవతెలంగాణ-ఆర్మూర్ : ఆమ్ ఆద్మీ పార్టీ పట్టణ మైనారిటీ అధ్యక్షుడు షేక్ వసీం , 20 వార్డు ఇంచార్జ్ షేక్ అమెర్ ల ఆధ్వర్యంలో బుధవారం మున్సిపల్ కమిషనర్ రాజు కు మెమోరాండం అందజేసినారు. వార్డ్ నెం. 20 లోని మసీదు దగ్గర డ్రైనేజీలను శుభ్రం చేయాలని, అవాంఛిత చెట్లను కత్తిరించడానికి జవాన్లను పంపమని కోరినారు. పట్టణంలో డెంగ్యూ , మలేరియా వంటి వ్యాధులతో ప్రజలు బాధపడుతున్నారు. సీసీ రోడ్లలో డ్రైనేజీల నుండి నీరు బయటకు వస్తుందని అన్నారు. సమస్యలను పరిష్కరించాలని కోరినారు.
- Advertisement -