నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : భువనగిరి మండలంలోని బిఎన్ తిమ్మాపురం గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలో 6వ తరగతి నుండి 9వ తరగతి గల విద్యార్థులకు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సమ్మర్ క్యాంప్ ను పాఠశాల ప్రధానోపాధ్యాయులు రచ్చ మల్లికార్జున్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ .. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ యొక్క సమ్మర్ క్యాంపు మే 15 నుండి మే నెల 31 వరకు ఉదయం 8 గంటల నుండి 11 గంటల వరకు విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ గ్రామర్ నేర్పించడంతో పాటూ, విద్యార్థులలో సృజనాత్మకత ను వెలికి తీసేందుకు ఇండోర్ గేమ్స్ చెస్, క్యారమ్స్, రింగ్ బాల్, స్కిప్పింగ్, వివిధ ఆటలు నిర్వహించడం జరుగుతుందని అన్నారు. విద్యార్థుల శారీరక దారుడ్యం కోసం యోగ నేర్పించడంతో పాటుగా వారికి పౌష్టిక ఆహారం అందించడం జరుగుతుందని అన్నారు. ఈ సమ్మర్ క్యాంపులో గ్రామంలో ఉన్న విద్యార్థులు అందరూ హాజరయ్యేలా వారి యొక్క తల్లిదండ్రులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు సిహేచ్ ఉపేందర్, ఏ బాలాజీ, ఫాతిమా,అరుణ విద్యార్థులు పాల్గొన్నారు.
తిమ్మాపురంలో సమ్మర్ క్యాంపు ప్రారంభం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES