- Advertisement -
నవతెలంగాణ-వెల్దండ: వెల్దండ మండలం బైరాపూర్ గ్రామంలో నిర్వహించిన సైదులు దర్గా ఉర్సు గంధోత్సవాలకు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి పాల్గొని..దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా కమిటీ సభ్యులు,గ్రామస్తులు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు. గతం సంవత్సరం సైదులు దర్గా ఆవరణలో చేపట్టిన మొత్తం రేకుల షెడ్డు నిర్మాణం భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉందని దర్గా నిర్వాహకులు, గ్రామస్తులు గుర్తు చేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో దర్గా నిర్వాహకులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



