- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : కర్నాటక సీఎం సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. వరుణ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2023లో ఆయన ఎన్నికను సవాల్ చేస్తూ కె.శంకర అనే వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. ఈ ఎన్నిక చెల్లదని, 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని నిబంధన ప్రకారం సిద్ధరామయ్య అవినీతికి పాల్పడ్డారని అందులో పేర్కొన్నారు. దీనిపై వివరణ ఇవ్వాలని సిద్ధరామయ్యకు సుప్రీంకోర్టు ఈ రోజు నోటీసులిచ్చింది.
- Advertisement -



