Monday, December 8, 2025
E-PAPER
Homeసినిమాసూర్య కొత్త సినిమా మొదలైంది

సూర్య కొత్త సినిమా మొదలైంది

- Advertisement -

హీరో సూర్య ప్రస్తుతం మల్టీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తన 47వ చిత్రం కోసం ‘ఆవేశం’ ఫేమ్‌ మలయాళ ఫిల్మ్‌ మేకర్‌ జితు మాధవన్‌తో కలిసి పనిచేయబోతున్నారు. దీంతో ఈ ప్రాజెక్ట్‌ ఈ సంవత్సరం అత్యంత ఎదురు చూస్తున్న అనౌన్స్మెంట్స్‌లో ఒకటిగా నిలిచింది. అభిమానులు, ప్రేక్షకుల్లో ఉత్సాహాన్ని రేకెత్తించింది. ఈ చిత్రంలో నజ్రియా నజీమ్‌ కథానాయికగా నటిస్తుండగా, విజయవంతమైన చిత్రాలతో అలరిస్తున్న యంగ్‌ ట్యాలెంటెడ్‌ నస్లెన్‌ ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. జఘరమ్‌ స్టూడియోస్‌ ఈ ప్రాజెక్టుకు మద్దతు ఇస్తోంది.ఈ సినిమా ఆదివారం చెన్నైలో సాంప్రదాయ పూజా కార్యక్రమంతో అధికారికంగా లాంచ్‌ అయింది. ఈ కార్యక్రమంలో చిత్ర తారాగణం, సిబ్బంది, పరిశ్రమ నుండి అనేక మంది ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ వేడుకకు చిత్ర నిర్మాత జ్యోతిక, నటుడు కార్తీ, రాజశేఖర్‌ పాండియన్‌ (2డీ ఎంటర్‌టైన్‌మెంట్‌), నిర్మాతలు ఎస్‌.ఆర్‌.ప్రకాష్‌, ఎస్‌.ఆర్‌. ప్రభు (డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌) తదితరులు విశిష్ట అతిథులుగా హాజరయ్యారు. వీరందరూ సినిమా విజయానికి హదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
పూజ తర్వాత, చిత్రీకరణను ప్రారంభించారు. అధికారికంగా మొదటి షెడ్యూల్‌ను ప్రారంభమైంది. దర్శకుడు జితు మాధవన్‌ మాట్లాడుతూ,’కొత్త పరిశ్రమ, కొత్త ప్రారంభం, అది కూడా సూర్య లాంటి స్టార్‌తో.. ఇది మరింత ఉత్సాహాన్ని ఇస్తోంది. మేము కొత్తగా ఏదైనా చేయడానికి ప్రయత్నిస్తున్నాం. మేము అందించాలనుకుంటున్న ఫ్రెష్‌నెెస్‌ని ప్రేక్షకులు అంగీకరించి ఆనందిస్తారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -