- Advertisement -
నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని జంగంపల్లి, తిప్పాపూర్, భిక్కనూర్, పెద్దమల్లారెడ్డి ఆయా గ్రామాలలో స్వామి వివేకానంద జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి జయంతి వేడుకలు నిర్వహించారు. అనంతరం ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ యువత స్వామి వివేకానంద ఆదర్శాలను అనుసరించాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రముఖులు, యువకులు, గ్రామస్తులు, తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



