- Advertisement -
న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా 7000 కంపెనీల్లోని ఉద్యోగులకు కార్పొరేట్ రివార్డ్స్ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు స్విగ్గీ తెలిపింది. కీలకమైన మెట్రో నగరాల్లో తొలుత దీన్ని అమలు చేస్తున్నట్టు పేర్కొంది. 2025 చివరి నాటికి 15,000 పైగా సంస్థలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంది. స్విగ్గీ యాప్లో కార్పొరేట్ రివార్డ్స్ విభాగంలోని తమ పనికి చెందిన ఈమెయిల్ ధృవీకరించడం ద్వారా ఉద్యోగులు రివార్డ్స్ పొందవచ్చని తెలిపింది. దీని ద్వారా మరిన్ని ప్రయోజనాలు, ప్రోత్సాహకాలు పొందవచ్చని ఆ కంపెనీ ప్రతినిధి దీపక్ మలూ పేర్కొన్నారు.
- Advertisement -