- Advertisement -
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
యాదాద్రి భువనగిరి జిల్లా నూతన యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు వేల్పుల యాద మల్లయ్య యాదవ్ ఎన్నిక కాగా ఆయనను శనివారం సాయంత్రం పిసిసి కార్యదర్శి తంగేళ్లపల్లి రవికుమార్ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యాదవుల సమస్యలపై పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తోటకూర కృష్ణ యాదవ్, బిచ్చలస్వామి, దేవునూరి బాలయ్య, నాదం, నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -