- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : గ్రీన్లాండ్ విషయంలో తమకు మద్దతు తెలపని ఈయూ దేశాలపై 10 శాతం టారిఫ్లు విధిస్తానన్న యూఎస్ అధ్యక్షుడు ట్రంప్ వెనక్కి తగ్గారు. ఫిబ్రవరి 1 నుంచి టారిఫ్లు అమలు చేస్తామన్న హెచ్చరికను ఉపసంహరించుకున్నారు. నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టేతో ఫలప్రదమైన చర్చలు జరిగినట్లు పేర్కొన్నారు. గ్రీన్లాండ్, ఆర్కిటిక్ ప్రాంత భవిష్యత్తు ఒప్పందానికి ఫ్రేమ్వర్క్ సిద్ధమైందని వెల్లడించారు. ఈ నిర్ణయం అమెరికాకే కాకుండా నాటో మిత్రదేశాలన్నిటికీ లాభదాయకమని తెలిపారు.
- Advertisement -



