- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మొయినాబాద్ ఫాం హౌస్ డ్రగ్స్ కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఇప్పటికే తాండూరు మాజీ ఎమ్మెల్యే ఫైలట్ రోహిత్ రెడ్డితో సహా ఐదుగురికి డ్రగ్స్ పరీక్షల్లో పాజిటివ్ రాగా.. తాజాగా టీడీపీకి చెందిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ యాదవ్కు డ్రగ్స్ పాజిటివ్ అని తేలింది. ఈగల్ ఎస్పీ గిరిధర్ ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. శనివారం రాత్రి నిర్వహించిన ప్రాథమిక పరీక్షల్లో ఎంపీకి నెగిటివ్ వచ్చినప్పటికీ, ఆదివారం నిర్వహించిన తదుపరి పరీక్షల్లో పాజిటివ్ అని నిర్ధారణ అయ్యిందని ఆయన తెలిపారు.
- Advertisement -



