Tuesday, June 3, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రాథమిక విద్యకు గొడ్డలి పెట్టు

ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రాథమిక విద్యకు గొడ్డలి పెట్టు

- Advertisement -

ఉపాధ్యాయుల సర్దుబాటు ఉత్తర్వులు విరమించుకోవాలి 
డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్
నవతెలంగాణ – నెల్లికుదురు:
ఉపాధ్యాయుల సర్దుబాటుకు సంబంధించి జిల్లా కలెక్టర్లకు అధికారమిస్తూ డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ విడుదల చేసిన ఉత్తర్వులను వెంటనే విరమించుకోవాలని డెమొక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ మండల శాఖ అధ్యక్షులు మండల రాజు,  ప్రధాన కార్యదర్శి :మంచాల సుధాకర్ డిమాండ్ చేస్తున్నట్ట తెలిపారు. ఆదివారం వారు మాట్లాడుతూ..  ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేస్తామని ఒకవైపు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తూనే,మరోవైపు పాఠశాలల్లో ఉపాధ్యాయుల సంఖ్య కుదింపుకు ఉత్తర్వులు జారీ చేయడం ప్రభుత్వ ద్వంద్వ వైఖరికి ఉదాహరణ. నిజానికి వేసవి కాలమంతా ఉపాధ్యాయులకు,అధికారులకు శిక్షణ మరియు బడిబాట పేరుమీద అనేక కార్యక్రమాలు చేపడుతూనే మరొకవైపు పిల్లలు తక్కువగా ఉన్నారన్న ఉద్దేశంతో టీచర్లను వేరే పాఠశాలలకు సర్దుబాటు చేయడం ద్వారా,  ప్రాథమిక పాఠశాలపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది అని తెలిపారు.  ప్రాథమిక పాఠశాలలో ప్రతి తరగతి కి ఒక ఉపాధ్యాయుడు, ఒక తరగతి గది ఉండాలని చాలా కాలంగా ఉపాధ్యాయ సంఘాలు, విద్యావేత్తలు, మేధావులు డిమాండ్ చేస్తున్నప్పటికీ, అందుకు భిన్నంగా విద్యార్థుల సంఖ్య ఆధారంగా ఉపాధ్యాయులను నియమించడం ఏ మాత్రం సరికాదు అని అన్నారు. సంఖ్యతో నిమిత్తం లేకుండా ప్రతి ప్రాథమిక పాఠశాలకు కనీసం ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా, పదిమంది విద్యార్థులకు ఒకే ఉపాద్యాయుడు అదేవిధంగా 60 మంది విద్యార్థుల వరకు  ఇద్దరు ఉపాధ్యాయులు మాత్రమే ఉండాలనడం పూర్తిగా అశాస్త్రీయం. అసంబద్ధం అని స్పష్టం చేస్తున్నాము అని తెలిపారు. ఒకటి నుంచి 5వ తరగతులకు-18 సబ్జెక్టులు, 60 మంది విద్యార్థులు ఉంటే, ఇద్దరు ఉపాధ్యాయులు ఏ విధంగా విద్యా బోధన సరైన రీతిలో చేయగలుగుతారని ప్రశ్నించారు.
ఈ చర్యలన్నీ ప్రభుత్వ విద్యారంగాన్ని ప్రైవేటుకు అప్పగించే విధానాలే తప్ప మరొకటి కాదు. అదే ప్రైవేటు పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ఒక తరగతి గది ఉండటం  వల్ల  విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు వైపు మొగ్గు చూపించడం జరుగుతున్నది. ముఖ్యమంత్రి గారు తమ ఉపన్యాసాలు మాటిమాటికి ప్రైవేటు విద్యను వ్యతిరేకిస్తున్నట్టు మాట్లాడిన, ఇలాంటి చర్యల ద్వారా పరోక్షంగా ప్రైవేటు విద్యకి ప్రోత్సాహాన్ని ఇస్తున్నట్టు నిరూపణ అవుతుంది. కావున ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాకుండా, తరగతికి ఒక ఉపాధ్యాయుడు, ప్రతి తరగతికి ఒక గది ఉండేలాగా చూస్తూ, వీటికి విరుద్ధంగా విడుదల చేసినటువంటి ఉత్తర్వులను వెంటనే విరమించుకొని. విద్యారంగంపై,ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చాలని,డిమాండ్ చేస్తున్నాము అనీ పేర్కొన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం విద్యార్థుల ఉపాధ్యాయుల నిష్పత్తి 1:30 అనేది కేవలం ఉన్నత పాఠశాల కే పరిమితం చేయాలని,ప్రాథమిక పాఠశాలకు ఈ నియమం వర్తింప జేస్తే ప్రాథమిక విద్య పూర్తిగా నిర్వీర్యం అవుతుందని ఈ సందర్భంగా పునరుద్ఘాటిస్తున్నాము.అంతే కాకుండా,ఉన్నత పాఠశాలలో కూడా సెక్షన్ల వారిగా ఉపాధ్యాయుల సంఖ్య నిర్ణయించాలని,భాషా ఉపాధ్యాయులను కూడా విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాకుండా, సెక్షన్ ల ప్రకారం చూడాలని విద్యాశాఖకు, ప్రభుత్వానికి, విన్నవిస్తున్నాము. వీటితో పాటుగా, అన్ని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రవేశపెట్టాలని, అన్ని ప్రభుత్వ పాఠశాలలను సెమీ రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చి,విద్యారంగానికి బడ్జెట్ పెంచి అవసరమైన మేరకు ఉపాధ్యాయుల నియామకం,మౌలిక సదుపాయాలు కల్పించాలని  డిమాండ్ చేస్తున్నాము.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -