- Advertisement -
నవతెలంగాణ-పాలకుర్తి
సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకొని శనివారం మండలంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలో గల ప్రగతి విద్యాలయం, సుధా టెక్నో స్కూల్, సిద్ధార్థ విద్యాలయం, కార్మెల్ స్కూల్, మండలంలోని చెన్నూరులో మహర్షి విద్యా మందిర్ పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకున్నారు. సమాజ దిక్సూచి ఉపాధ్యాయులేనని, విద్యార్థిని, విద్యార్థులను తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర వెలకట్టలేనిదని పలువురు వక్తలు కొనియాడారు. విద్యార్థిని, విద్యార్థులను మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల కృషి అభినందనీయం అన్నారు.
- Advertisement -