- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్ : జేసీఐ అలుమ్ని క్లబ్, విశ్వతేజస్ సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం సాయంత్రం నిజామాబాదు నగరంలోని వీఎన్నార్ పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని వివిద పాఠశాలలకు చెందిన 14 మంది ఉపాద్యాయులను ఘనంగా సన్మానించారు. ఉపాధ్యాయ వృత్తి ఎంతో పవిత్రమైందని ఈ కార్యక్రమానికి ముఖ్యాతిధిగా హాజరైన జేసీఐ అలుమ్ని జోన్ వైస్ చైర్మెన్ విజయానంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వతేజస్ అధ్యక్షుడు తిరునగరి శ్రీహరి, టీచర్స్ డే ప్రాజెక్టు చైర్మెన్ లావణ్య, జేసీఐ జోన్ ఆఫీసర్ జిల్కర్ నయన్, పూర్వద్యక్షులు యాదేష్, గంగాదాస్, మహిళా విభాగం పూర్వాద్యక్షురాలు ప్రసన్న, వీణ, జేసీఐ సభ్యుడు యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -