- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : భారత్తో మూడు వన్డేల సిరీస్లో భాగంగా అడిలైడ్ వేదికగా జరిగిన రెండో మ్యాచ్లో ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. 265 పరుగుల లక్ష్యాన్ని 46.2 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. వరుసగా రెండో ఓటమి చవిచూసిన భారత్.. సిరీస్ను చేజార్చుకుంది. షార్ట్ (74), కూపర్ (61*) అర్ధశతకాలతో చెలరేగారు. భారత్ బౌలర్లలో హర్షిత్, వాషింగ్టన్ సుందర్, అర్ష్దీప్ తలో 2 వికెట్లు పడగొట్టగా.. అక్షర్ పటేల్, సిరాజ్ ఒక వికెట్ తీశాడు.
- Advertisement -



