- Advertisement -
నవతెలంగాణ – జన్నారం
జన్నారం మండలంలో తీసు ఉత్సవాలని లంబాడా బంజారా సోదరులు ఆదివారం ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ ఉత్సవాలలో ఖానాపూర్ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బుక్య జాన్సన్ నాయక్ పాల్గొన్నారు. మహిళలతో కలిసి నృత్యాలు చేశారు. టీచ్ ఉత్సవాల సందర్భంగా లంబాడా బంజారా సోదరులు ఉదయం మండల కేంద్రంలోని సేవాదాస్ నగర్ లో ఉన్న ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం డీజే చెప్పులతో ఆలయం నుంచి తాసిల్దార్ చౌరస్తా వరకు భారీగా ర్యాలీ నిర్వహించి సాంప్రదాయ నృత్యాలు చేశారు. కార్యక్రమంలో సందేశ్ రాములు, రాజు నాయక్ నాయక్ ప్రకాష్ నాయక్, శ్రీనివాస్ నాయక్ నిఖిల్ తేజ, నందు నాయక్, నీలయ్య, శంకర్ నాయక్ సుధాకర్ నాయక్, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
- Advertisement -