Thursday, September 4, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుఏఐ క్యాపిటల్‌గా తెలంగాణ

ఏఐ క్యాపిటల్‌గా తెలంగాణ

- Advertisement -

ఐటీ, పరిశ్రమల
శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణను ‘ఏఐ క్యాపిటల్‌ ఆఫ్‌ ది గ్లోబ్‌’గా మార్చడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని హైటెక్‌ సిటీలో అమెరికాకు చెందిన ప్రముఖ ఎంటర్‌ప్రైజ్‌ ప్రొక్యూర్‌మెంట్‌, సప్లయర్‌ కొలాబరేషన్‌ సంస్థ జాగర్‌కు చెందిన గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్‌ (జీసీసీ)ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక్క టెక్నాలజీనే కాకుండా అన్ని రంగాలకు చెందిన ప్రపంచ దిగ్గజ సంస్థలకు హైదరాబాద్‌ గమ్యస్థానంగా మారిందన్నారు. ఈ జాబితాలో జాగర్‌ కూడా చేరడంతో తెలంగాణ బ్రాండ్‌ మరింత విశ్వవ్యాప్తం అవుతుందని అభిప్రాయపడ్డారు. ”కొత్తగా ప్రారంభమైన జీసీసీ ద్వారా 180 మందికి ఉపాధి లభిస్తుంది. రాబోయే రోజుల్లో ఆ సంఖ్య 500కు చేరుతుంది. జాగర్‌ ఏఐ ప్లాట్‌ ఫాం, ఏఐ ఆధారిత ప్రొక్యూర్‌మెంట్‌ పరిష్కారాల అభివృద్ధికి వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా తయారీ, విద్య, ఎఫ్‌ఎంసీజీ, రిటైల్‌ తదితర రంగాలకు సాఫ్ట్‌వేర్‌, క్లౌడ్‌ ఆపరేషన్‌ సేవలను అందిస్తుంది’ అని మంత్రి వివరించారు. జీసీసీల ఏర్పాటుకు తెలంగాణ అనుకూలమని చెప్పారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా గతేడాది 70 జీసీసీలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయని గుర్తు చేశారు. ఈ ఏడాది 100 జీసీసీలను కొత్తగా ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ”ఏఐ రంగంలో తెలంగాణను అగ్రగామిగా నిలిపేందుకు ప్రత్యేకంగా ఏఐ సిటీని అభివృద్ధి చేయనున్నాం. ప్రపంచానికి ఏఐ నిపుణులను అందించేలా అంతర్జాతీయ ప్రమాణాలతో ఏఐ యూనివర్సిటీ, ఏఐ ఇన్నోవేషన్‌ హబ్‌ ను ఏర్పాటు చేయబోతున్నాం’ అని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాగర్‌ సీఈఓ ఆండ్రూ రోస్కో, చీఫ్‌ డిజిటల్‌ ఆఫీసర్‌ గోపీనాథ్‌ పోలవరపు, చీఫ్‌ కస్టమర్‌ ఆఫీసర్‌ ట్రారు మేయర్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad