- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : ఈ నెల 16న రాష్ట్ర క్యాబినెట్ సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తెచ్చిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీనిపై మంత్రివర్గం చర్చించనుంది. అలాగే గతంలో మాదిరిగా రిజర్వేషన్ల పరిమితి 50శాతానికి మించకుండా ఎన్నికలకు వెళ్లొచ్చన్న హైకోర్టు ఉత్తర్వులపై సీఎం రేవంత్ మంత్రులతో చర్చించనున్నారు.
- Advertisement -