- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఐడీపీఎల్ భూములపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. కూకట్పల్లిలోని సర్వేనంబర్ 376లో రూ.4 వేల కోట్ల విలువైన భూములపై విజిలెన్స్ విచారణ చేపట్టాలని ఆదేశించింది. భూ కబ్జాలపై ఇటీవల ఎమ్మెల్యే మాధవరం, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం సమగ్ర విచారణకు ఆదేశించినట్లు తెలుస్తోంది.
- Advertisement -



