Wednesday, June 4, 2025
E-PAPER
Homeకరీంనగర్కేసీఆర్ తోనే తెలంగాణ ఏర్పాటు..

కేసీఆర్ తోనే తెలంగాణ ఏర్పాటు..

- Advertisement -
  • బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య
  • నవతెలంగాణ – సిరిసిల్ల టౌన్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలోఎన్నో పోరాటాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు. సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మొదటగా స్థానిక తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నాయకులు పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన జాతీయ జెండాను పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆవిష్కరించారు. అనంతరం తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను బీఆర్ఎస్ జెండాను జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య ఆవిష్కరిం చగా, ఎమ్మెల్యే కేటీఆర్ క్యాంపు కార్యాలయంలో నాఫ్స్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు జాతీయ జెండా ఎగరవేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేసీఆర్ పోరాటంతోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆయన నేతృత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని, దేశంలోనే అగ్రగామిగా నిలిచిందన్నారు. రాబోవు రోజుల్లో కేసీఆర్ పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, వేములవాడ నియోజకవర్గ ఇంచార్జి చల్మెడ లక్ష్మీనరసింహరావు, మాజి ఎమ్మెల్యే ఉచ్చిడి మోహన్రెడ్డి, మాజి జడ్పీ చైర్పర్సన్ న్యాలకొండ అరుణ, జిల్లా గ్రంథాలయ మాజి చైర్మన్ ఆకునూరి శంకరయ్య, మున్సిపల్ మాజి చైర్మన్ జిందం కళ, ఆయా మండలాల ఫ్యాక్స్ చైర్మన్లు, మాజి జడ్పిటిసిలు, ఎంపిపిలు, మాజి కౌన్సిలర్లు, తదితర నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -