- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తెలుగు భాష దినోత్సవం కాళోజి జయంతిని పురస్కరించుకొని తెలుగు భాష ఉపాధ్యాయులు డాక్టర్ ఎండి అంజాద్ నీతి శతక పుస్తకాలను పంపిణీ చేశారు. తెలంగాణ భాష దినోత్సవం కాళోజి నారాయణరావు జయంతిని పురస్కరించుకొని వికరాబాద్ జిల్లా పరిషత్ ఉన్నత బాలుర పాఠశాలలో తెలుగు భాష ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న డాక్టర్ ఎండి అంజాద్ 8000 రూపాయలు వెచ్చించి వేమన శతకం సుమతి శతకం మొదలగు నీతి శతకాల కొనుగోలు చేసి తాను పనిచేస్తున్న పాఠశాల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు డాక్టర్ ఎండీఅంజాద్ ను అభినందించారు.
- Advertisement -