Wednesday, July 23, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత…

కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత…

- Advertisement -
  • – ఎస్ఎఫ్ఐ నాయకులకు పోలీసులకు మధ్య తోపులాట ఘర్షణ..
    నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
  • పెండింగ్ లో ఉన్న 8300 వేల కోట్ల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని ఎస్ఎఫ్ఐ యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులతోటి చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించగా, ఎస్ఎఫ్ఐ నాయకులు పోలీసుల మధ్య ఉద్రిక్తత  చోటుచేసుకుంది. పోలీసులువారిని అరెస్ట్ సందర్భంలో తోపులాట జరిగింది. 
  • ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ఆరు సంవత్సరాల నుంచి 8300వేల కోట్ల స్కాలర్షిప్లో పెండింగ్లో ఉన్నాయి విడుదల చేయడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు గత పది సంవత్సరాలు పాలించిన టిఆర్ఎస్ ప్రభుత్వం విడుదల చేయకుండా కాలయాపన చేసిందనీ, ప్రభుత్వ విద్యారంగాన్ని బ్రస్టు పట్టించిందనారు. నూతనంగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం పేరుతోటి అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్న స్కాలర్షిప్లు విడుదల చేయడంలో చిత్తశుద్ధి కనబడటం లేదు తన తన మేనిఫెస్టోలోని అధికారులు వస్తే ఎడారిలోనే ఫీజు రియంబర్స్మెంట్ పూర్తిగా చెల్లిస్తామని హామీ ఇచ్చి ఇప్పుడు దాని ఊసి కూడా ఎత్తడం లేదు ఒకవైపు ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాల బలవపదం చేస్తామంటున్న ప్రభుత్వం మరోవైపు ఎలాంటి అనుమతులు లేని ప్రైవేట్ విద్యాసంస్థలను స్థానిక ఎమ్మెల్యేలు ప్రారంభించడం సిగ్గుచేటు అదేవిధంగా జిల్లాలో ప్రవేటు విద్యాసంస్థలు విచ్చలవిడిగా ఫీజుల దోపిడీ చేస్తున్న అధికారులు చూసి చూడంగానే వివరిస్తున్నారు.
  • జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవేటు విద్యాసంస్థలు తొత్తుగా వ్యవహరిస్తున్న పారిపై చర్యలు తీసుకోవాలని అదేవిధంగా ప్రభుత్వ విద్యారంగాన్ని బలోపేతం చేయాలని ప్రభుత్వ పాఠశాలలో కనీసం మౌలిక సదుపాయాలు లేవు, విద్యార్థులకు ఇప్పటివరకు రెండు దుస్తుల, పూర్తిస్థాయిలో పుస్తకాలు ఇవ్వలేదు అదేవిధంగా జిల్లాలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో పూర్తిగా శిథిల వ్యవస్థలో ఉన్నాయి. తెలంగాణ విద్యా సంస్థలు అంటేనే గురుకులం చెప్పుకున్న రాష్ట్ర ప్రభుత్వం గురుకులాల్లో రోజుకు ఫుడ్ పాయిజన్ గురవుతున్న కనీసం అధికారులు పరామర్శించడం గాని సమీక్షించడం కానీ జరపడం లేదు. గురుకులాల మీద చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు గురుకులాలకు సొంత భవనాలు లేక అద్దె కొనసాగుతున్నాయి.
  • అద్దె భవనాలు కూడా కిరాయికి కట్టలేక యజమానులు తాళాలు వేసే పరిస్థితి ఉన్నది  సంక్షేమ హాస్టళ్లకు, గురుకులాలకు సొంత భవనాలు నిర్మించాలి జిల్లా వ్యాప్తంగా అనేక గ్రామాలకు బస్ సౌకర్యం లేదు బస్ సౌకర్యం లేక విద్యార్థులు నడుచుకుంటూ ఆటోలకు పాఠశాలకు వెళ్తున్నారు జిల్లాలో ప్రభుత్వ విద్యా రంగం బలోపేతంపై జిల్లా కలెక్టర్ గారు విద్యార్థి సంఘాల నాయకులతో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి జిల్లావ్యాప్తంగా ఉన్న విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని లేనియెడల జిల్లా అధికారులను ఎమ్మెల్యేలను జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ అడ్డుకుంటామని హెచ్చరించడం జరుగుతున్నది, విద్యార్థులకు పోలీసులకు తోపులాటతో చాలామంది విద్యార్థులకు గాయాలకు జరిగాయి ప్రజా ప్రభుత్వం చెప్పుకుంటున్నటువంటి ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన తీసుకొస్తున్నామని చెప్పిన, అధికారులు విద్యార్థుల వచ్చి సమస్యలను తెలుసుకునే సమయం కూడా లేకుండా విద్యార్థుల మీద పోలీసుల లాటి చార్ట్ చేయడం సిగ్గుచేటు ఇప్పటికైనా ప్రభుత్వం ఇలాంటి చర్యలు మానుకోవాలని లేనియెడల విద్యార్థులే ప్రతిఘటించాల్సిన పరిస్థితి వస్తుందని, ప్రభుత్వం స్పందించి  విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు . ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వేముల నాగరాజు, కాసుల నరేష్, ఈర్ల రాహుల్ ,జిల్లా సహాయ కార్యదర్శి తీగుళ్ల శ్రీనివాస్, జిల్లా కమిటీ సభ్యులు పుట్టల ఉదయ్, ధరావత్ జగన్, బుగ్గ ఉదయ్, ఈర్ల కార్తీక్, ఎండి నేహాల్, హిందు రాణి, గాయత్రి, శ్రావణ్ రెడ్డి, మైసూర్ల నరేందర్ మహేష్, సతీష్ లు పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -