- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: ఢిల్లీలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో రాష్ట్ర సరిహద్దుల్లో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీపీ సునీల్దత్ ఆదేశాల మేరకు బుధవారం అర్ధరాత్రి 11 గంటల సమయంలో కల్లూరు ఏసీపీ అనిశెట్టి రఘు ఆధ్వర్యంలో గంగారం గ్రామ పరిధిలో విస్తృత తనిఖీలు చేపట్టారు. జాతీయ రహదారిపై ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చే వాహనాలను ఆపి పోలీసులు పూర్తి స్థాయి తనిఖీలు నిర్వహించారు. ఆకస్మిక తనిఖీలతో వాహనదారుల్లో ఆందోళన నెలకొంది.
- Advertisement -



