Sunday, October 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగవర్నర్‌ను కలిసిన టీజీపీఎస్సీ చైర్మెన్‌

గవర్నర్‌ను కలిసిన టీజీపీఎస్సీ చైర్మెన్‌

- Advertisement -

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీజీపీఎస్సీ) చైర్మెన్‌ బి వెంకటేశంతోపాటు ఇతర సభ్యులు గవర్నర్‌ జిష్ణుదేవ్‌వర్మను శనివారం హైదరాబాద్‌లోని రాజ్‌భవన్‌లో కలిశారు. 2024-25కు సంబంధించిన వార్షిక నివేదికను అందజేశారు. ఈ కాలంలో టీజీపీఎస్సీ కార్యక్రమాలు, ఉద్యోగాల కల్పనలో ముఖ్యమైన మైలురాయిని సాధించిందని వివరించారు. ఈ కార్యక్రమంలో టీజీపీఎస్సీ కార్యదర్శి ప్రియాంక అల, సభ్యులు ఆమీర్‌ఉల్లాఖాన్‌, ఎన్‌ యాదయ్య, పాల్వాయి రజనీ, ఎల్‌బీ లక్ష్మీకాంత్‌రాథోడ్‌, సి చంద్రకాంత్‌రెడ్డి, విశ్వప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -