- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: హైదరాబాద్ ప్రయాణికులకు టీజీఎస్ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. T24 టిక్కెట్ ధరను తగ్గించారు. ఆ ఆఫర్ ఆగస్ట్ 31 వరకు అమల్లో ఉంటుంది. సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ప్రెస్ తో పాటు మెట్రో డీలక్స్ బస్సుల్లో 24 గంటల ప్రయాణానికి ఈ టికెట్లను కొనుగోలు చేయవచ్చు. పెద్దల టికెట్ ధర రూ.150 నుంచి రూ.130కి, మహిళలు, సీనియర్ సిటిజన్ల టికెట్ ధరను రూ.120 నుంచి రూ.110కి, పిల్లల టికెట్ ధర రూ.100 నుంచి రూ.90కి సవరించారు.
- Advertisement -