”కాంతార’తో జానపద కథలకు మళ్లీ పునర్వైభవం తీసుకొచ్చారనే ప్రశంసలు రావడం చాలా ఆనందంగా ఉంది. ‘కాంతార : చాప్టర్1′ కథని కూడా చాలా నిజాయితీగా చెప్పాలనుకున్నాం. అది ప్రేక్ష కులకు నచ్చింది. మన దేశం జానపద కథలకు నిలయం. ఈ సినిమా విజయం మరిన్ని జానపద కథలు రావడానికి అవకాశం కల్పించడం చాలా ఆనందంగా ఉంది’ అని కథానాయకుడు, దర్శకుడు రిషబ్శెట్టి అన్నారు. హౌంబలే ఫిల్మ్స్ నిర్మించిన ‘కాంతార: చాప్టర్ 1’ చిత్రం తొలి వారంలో ప్రపంచవ్యాప్తంగా 509 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి కొత్త బెంచ్ మార్క్ని క్రియేట్ చేసింది. ఇప్పటికీ బాక్సాఫీసు వద్ద సంచలనం సృష్టిస్తూ సక్సెస్ఫుల్గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా హీరో, దర్శకుడు రిషబ్ శెట్టి మీడియాతో ముచ్చటించారు.
తెలుగు ప్రేక్షకులకి హృదయపూర్వక కృతజ్ఞతలు. చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ‘కాంతార’కి ఎంత మంచి రెస్పాన్స్ వచ్చిందో, ఈ సినిమాకి కూడా అంత గొప్ప రెస్పాన్స్ ఇచ్చారు.
నాకు జానపద కథలు చేయడం ఇష్టం. ‘కాంతార’ మా ప్రాంతంలో జరిగిన కథ. అందుకే లొకేషన్ కూడా మా ప్రాంతాన్నే తీసుకున్నా. ‘కాంతార’ లాంటి సినిమాకి వరల్డ్ బిల్డింగ్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్. ‘కాంతార’ కోసం మా ప్రాంతంలోనే ఒక ప్రత్యేకమైన స్టూడియో కూడా ఏర్పాటు చేశాం. చిన్నప్పుడు నుంచి మా ఊర్లో షూటింగ్ చేయాలని కోరిక ఉండేది. మా ఊరు, మా ప్రాంతం వాళ్లు కూడా ఈ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవ్వడం చాలా ఆనందంగా ఉంది. అలాగే నా వైఫ్ ఈ సినిమాకి ఇచ్చిన సపోర్టు మర్చిపోలేను. కాస్ట్యూమ్ డిజైనర్గా తన కాంట్రిబ్యూషన్ మాకు ఎంతగానో హెల్ఫ్ అయింది.
రుక్మిణి ప్రీవియస్ సినిమాలు చూసి సెలెక్ట్ చేశాను. అలాగే గుల్షన్ దేవయ్య, జయరాం పాత్రలు కూడా అద్భుతమైన ఆదరణ పొందాయి. ప్రతి ఒక్కరూ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. అజినిష్ సినిమాకి చాలా డిఫరెంట్గా కంపొజిషన్ చేశారు. హౌంబలే ఫిల్మ్స్ ఈ సినిమాకి ఇచ్చిన సపోర్టు మామూలుది కాదు. కేవలం నిర్మాతలుగా కాదు పర్సనల్గా, మోరల్గా కూడా సపోర్ట్ ఇచ్చారు. వారి సపోర్ట్తోనే సినిమా ఇంత అద్భుతంగా వచ్చింది. ఎన్టీఆర్ నాకు సోదరుడు. ఆయన చాలా గొప్ప సపోర్ట్ ఇచ్చారు. తను ఇచ్చిన సపోర్ట్కి జీవితాంతం రుణపడి ఉంటాను. ప్రస్తుతం ‘జై హనుమాన్’ చేస్తున్నా.
- హీరో, దర్శకుడు రిషబ్శెట్టి