- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తప్పనిసరి పరిస్థితుల వల్లే దేశాన్ని వీడానని బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తెలిపారు. తాను అక్కడే ఉండుంటే తనతోపాటు చుట్టూ ఉన్న వాళ్ల ప్రాణాలు ప్రమాదంలో పడేవని చెప్పారు. ‘దేశంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు కట్టుబడి ఉన్నా. ఆగస్టులో జరిగినది హింసాత్మక తిరుగుబాటు. బంగ్లా ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ నాకు మరణశిక్ష విధించినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. అది బూటకపు విచారణ’ అని ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు.
- Advertisement -

 
                                    