నవతెలంగాణ – మల్హర్ రావు
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన, ఉత్తమ విద్యను అందిస్తారని,తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలని మండల ఎంపిడిఓ శ్రీనివాస్ సూచించారు. ప్రొపెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో భాగంగా శుక్రవారం తాడిచెర్ల గ్రామపంచాయితి ఆవరణలో బడిబాటపై కార్యక్రమంపై పంచాయతీ కార్యదర్శి మల్లిఖార్జున రెడ్డి ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఎంపిడిఓ ముఖ్యదితిగా హాజరై మాట్లాడారు ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు తమ భాగస్వామ్యంతో ఉత్తమ విద్యా ప్రమాణలు కలిగిన, ఉత్తమ విద్యను అందించే ప్రభుత్వ పాఠశాలలకు విద్యార్థులను పంపించాలని కోరారు.బడిడు పిల్లలను బడుల్లో చేర్పించేలా అంగన్వాడీ టీచర్స్ చొరవ తీసుకోవాలని చూచించారు. ఈ కార్యక్రమంలోఎంపీవో విక్రమ్ కుమార్,ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు, అంగన్ వాడి టీచర్లు, ఆశాలు, గ్రామప్రజలు పాల్గొన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లోనే ఉత్తమ విద్య..!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES