– టిఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు
నమోదు పెంపుకు ప్రచార జాతా….
నవతెలంగాణ – అశ్వారావుపేట : తల్లిదండ్రులు తమ పిల్లలను తమ ఊరిలోని ప్రభుత్వ బడుల్లోనే చేర్పించి నాణ్యమైన విద్యను పొందాలని టిఎస్ యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు అన్నారు. ప్రభుత్వ బడులను కాపాడుకుంటేనే భవిష్యత్తులో ఉత్తమ సమాజం రూపొందుతుందని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లల నమోదు పెంపుదల కొరకు టీఎస్ యూటీఎఫ్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న ప్రచార జాతా ఆదివారం అశ్వారావుపేట నియోజక వర్గం కేంద్రానికి చేరింది. ఈ సందర్భంగా బస్టాండ్ సెంటర్,తదితర ప్రాంతాల్లో కరపత్రాలను పంపిణీ చేసి అనంతరం తల్లిదండ్రులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ .. ప్రభుత్వ పాఠశాలలో సుశిక్షితులైన ఉపాధ్యాయులు ఉన్నారని, విశాలమైన తరగతి గదులు, ఆటస్థలం ఉన్నాయని తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి నాణ్యమైన విద్యను ఉచితంగా పొందాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ బడులను కాపాడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపైన ఉన్నదని తెలియజేశారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నోటు పుస్తకాలు, వర్క్ బుక్ లు, ఏకరూప దుస్తులు ఉచితంగా అందించబడుతున్నాయని తెలిపారు. నాణ్యమైన మధ్యాహ్న భోజనం, వారానికి మూడు సార్లు కోడిగుడ్లు, రాగి జావ అందిస్తున్నారని, తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలను ఆదరించి పిల్లలను చేర్పించి, ఫీజుల భారం లేని ఉచిత విద్య పొందాలని, విద్యార్థుల సమగ్ర వికాసానికి ప్రభుత్వ పాఠశాలలు దోహదపడతాయని తెలియజేశారు. ఈ ప్రచార జాతా లో టిఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు వి.వరలక్ష్మి, కార్యదర్శి కృష్ణారావు,ఆర్ రమేష్ కుమార్,ఆడిట్ కమిటీ సభ్యులు ఎం.రాజేశ్వరరావు, కమిటీ సభ్యులు ఎన్.కొండలరావు,ఎం. వెంకటేశ్వర్లు,ఎన్.సురేష్, తదితరులు పాల్గొన్నారు.
ఊరి బడులతోనే ఉత్తమ సమాజం..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES