- Advertisement -
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఈ నేర 14న రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా గ్రామాల్లో సర్పంచ్ వార్డు సభ్యులకు ఆయా పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రజలతో ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగానే ఏకగ్రీవమైన గ్రామాలను వదిలి ఎన్నికల జరగవలసిన గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది. అభ్యర్థులు హామీల వర్షాలు కురిపిస్తూ తమకు ఓటు వేసి గెలిపించాలని వేడుకుంటున్నారు. ఇందల్ వాయి మండల కేంద్రంలోని తిర్మన్ పల్లి గ్రామంలో ఏడుగురు అభ్యర్థులు సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నారు కొందరు వాహనాల ద్వారా , ఇంకొందరు మహిళలు యువకుల ద్వారా ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుసుకుంటున్నారు.
- Advertisement -



