- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : తిరుమల తిరుపతి దేవస్థానంలో గత 10 రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఈ రోజు వీకెండ్ కావడంతో మరోసారి భక్తులు పోటెత్తారు. శనివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి.. శిలాతోరణ వరకు చేరుకున్నారు. దీంతో శ్రీవారి సర్వదర్శనానికి 20 గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. వేసవి సెలవులు ముగుస్తుండటం, వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు భక్తుల రద్ధీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
- Advertisement -