- Advertisement -
- బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్
- నవతెలంగాణ – డిండి
- వడ్డెమాను నారయ్య మృతి బాధాకరం అని బిఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. శనివారం డిండి మండలం ఖానాపూర్ గ్రామంలో నారయ్య మృతి దేహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన నారయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. నారయ్య ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. ఆయన వెంట సూదిని కృష్ణా రెడ్డి, బొడ్డుపల్లి జయంత్, బొడ్డుపల్లి కృష్ణ, రమావత్ తులసిరామ, వడ్డెమాను శంకర్, లక్ష్మయ్య, తదితరులు ఉన్నారు.
- Advertisement -